Thursday, May 16, 2024

Vijayawada – విజిలెన్స్ తనిఖీలలో రూ.75ల‌క్ష‌ల విలువైన విదేశీ సిగరెట్లు పట్టివేత

విజయవాడ క్రైం ప్రభ న్యూస్ – విజయవాడలో అర్థరాత్రి విజిలెన్స్ అధికారులు నిర్వ‌హించిన విస్తృత తనిఖీలో భారీగా విదేశీ సిగరెట్లు ప‌ట్టుబ‌డ్డాయి.. నగరంలోని రామ‌వరప్పాడు రింగ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లు ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి కంటైనర్ లో విజయవాడకి అక్రమంగా తరలిస్తున్న 90 లక్షల విలువ చేసే 75 బాక్సుల విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు.

అధికారుల కంటపడకుండా కంటైనర్ కు ఎస్కార్ట్ ఏర్పాటు చేసుకుని మరి విదేశీ సిగరెట్లు దొంగతనంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ తనిఖీలు జరుగుతూ ఉండటంతో ప్రధాన నిందితుడు కారు వదిలి పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పటమట పోలీసులు .

Advertisement

తాజా వార్తలు

Advertisement