Sunday, April 28, 2024

ADB: పింఛన్ దారుల ఔదార్యం… కేసీఆర్, కేటీఆర్ నామినేషన్లకు రూ.లక్ష విరాళం

ఇచ్చోడ, ప్రభ న్యూస్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్ర కె గ్రామానికి చెందిన 100మంది పెన్షన్ దారులు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ల నామినేషన్ల కోసం లక్ష రూపాయల విరాళాలను ఇచ్చారు. గ్రామంలోని 100మంది పెన్షన్ దారులు తమ నెలవారి పెన్షన్ నుండి తలా వెయ్యి రూపాయలు జమ చేసి నామినేషన్ కోసం అందజేసినట్లు గ్రామ సర్పంచ్ మీనాక్షి తెలిపారు.

తమకు పెద్దదిక్కు కేసిఆర్ అని, తమకు ప్రతినెలా 2000 రూపాయల పెన్షన్ ఆయన దయతోనే వస్తుందని, తమ వంతు సహాయంగా లక్ష రూపాయలను పోగుచేసి ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గాడిగే సుభాష్ తో పాటు పింఛన్ దారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement