Friday, May 3, 2024

VZNM: 59 మందికి లా నేస్తం విడుదల..

విజయనగరం, డిసెంబర్ 11 (ప్రభ న్యూస్) : జిల్లాలోని 59మంది యువ న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం విడుదలైంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లా నేస్తాన్ని న్యాయవాదుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. నెలకు రూ.5వేలు చొప్పున ఆరు నెలలకు సంబంధించి రూ.30వేలు మొత్తాన్ని ఒక్కొక్కరికి విడుదల చేశారు.

ఈ ఏడాది జూలై, ఆగస్ట్ నెలలకు 59మందికి, సెప్టెంబర్ నెలకు 57మందికి, అక్టోబర్ నెలకు 58 మందికి, నవంబర్ నెలకు గాను 57మందికి విడుదల చేశారు. ఈ 59 మందిలో బీసీలు 39మంది, ఓసీలు 9, ఎస్సీలు 10, ఎస్టీలు ఒక్కరు ఉన్నారు. జిల్లా నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరిండెంట్ గొట్టాపు రాము, యువ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement