Thursday, May 16, 2024

ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిలెన్స్ సోదాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే రాజంపేట, ప్రొద్దుటూరు, నందలూరు, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు జరుగుతున్నాయి. తుని ఏరియా ఆస్పత్రిలో 8మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉద్యోగుల హాజరు, ఔషధ గణాంకాలు, సిబ్బంది కొరత, పనితీరుపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement