Saturday, May 4, 2024

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు గురువారం ఉదయం వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అంజేశారు. దర్శనానంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోందని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌‌ను అరికట్టేందుకు ఏపీకి కేంద్రం సాయం చేస్తుందన్నారు. వకులామాత ఆలయ నిర్మాణానికి టీటీడీ పూనుకోవడంపై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ వార్త కూడా చదవండిః ఏపీలో ప్రభుత్వ బడుల సమయం పెంపు.. స్కూల్ టైమింగ్స్ ఇవి

Advertisement

తాజా వార్తలు

Advertisement