Monday, May 13, 2024

మహిళలను టార్గెట్​ చేసి మాట్లాడొద్దు.. ఎవరికీ మంచిది కాదు: నారా లోకేశ్​

ఉత్తరాఖండ్‌ ఎన్నికల ర్యాలీలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లీడర్​ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్​.  ఈ మేరకు ట్విట్టర్​లో రాహుల్​కు మద్దతుగా నిలిచారు. వివాదాస్పద అంశాలపై రాజకీయ చర్చ చాలా కీలకమైనప్పటికీ వాడే భాష, చేసే ప్రకటనలు ఎప్పుడూ మర్యాద, హద్దులు దాటకూడదని ఎమ్మెల్సీ నారా లోకేశ్​ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు బాగాలేవని ఆయన అన్నారు.

అంతేకాకుండా, గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన తల్లిని ‘దూషణ చేశారని, ఆ అనుభవంతో చెబుతున్నా.. ఆ మాటలు ఎంత బాధాకరమో అని పోల్చారు నారా లోకేశ్​. మహిళలను లక్ష్యంగా చేసుకుని మాటలనడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు” అని ట్విట్టర్​లో పేర్కొన్నాడు.  అయితే.. రాహుల్ గాంధీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడని రుజువు చేయాలని బీజేపీఎప్పుడైనా డిమాండ్ చేసిందా అని అస్సాం ముఖ్యమంత్రి ప్రశ్నించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement