Wednesday, May 15, 2024

Breaking: అనంతపురంలో ఘోరం.. ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా పరిగిలో ఘోరం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరిగి ధనాపురం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురుగా వచ్చాయి.

వేగంగా ఢీకొనడంతో పరిగి మండలానికి చెందిన ప్రసాద్ కుమార్ 43 మడకశిర మండలం ఎల్లోటికి చెందిన మంజు 40 ప్రమాద స్థలంలో మరణించారు. మరో ఇద్దరు గాయాలకు గురవడంతో వారిని చికిత్స కోసం హిందూపురం తరలించారు. వీరిలో విజయ్, ఎల్లోటి శివా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement