Sunday, May 19, 2024

TTD | రేపు శ్రీవారి పార్వేట ఉత్సవం.. అర్జిత సేవలు రద్దు

తిరుమల, ప్రభ న్యూస్‌ ప్రతినిధి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకరసంక్రాంతి పర్వదినం మరుసటి రోజున కనుమనాడు జనవరి 16న అత్యంత వైభవంగా జరగనుంది. అదేరోజు గోదా పరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదా పరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్‌ అమ్మవారి మాలలను పెద్దజీయ్యర్‌ స్వామి మఠం నుంచి ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీమలయప్పస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కట ఆస్థానం, పార్వేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఈ కారణంగా 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళపాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement