Saturday, April 27, 2024

కర్నూలు జిల్లాలో విషాదం, ఈతకు కొడుతుంటే కరెంట్​షాక్.. నలుగురు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులకు కరెంట్​ షాక్​ రావడంతో చనిపోయారు. ఈ ఘటన క్రిష్ణగిరి మండలం అలంకొండ గ్రామంలో ఇవ్వాల (గురువారం) జరిగింది. ప్రమాదవశాత్తు పాంపాండ్​లో పడి నలుగురు చిన్నారులు చనిపోయారు. పొలంలో ఆడుకుంటూ అక్కడే ఉండే పాంపాండ్​లో (గచ్చు) లో ఈత కొట్టేందుకు దిగారు. అయితే ఈత కొడుతుండగా నీటిలో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో విద్యుత్ షాక్ తో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారులు కార్తీక్ (13), సాయి (12), రాకేష్ (12), కమల్ (12) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement