Saturday, May 4, 2024

కార్తీక మాసం.. రాజ‌మండ్రిలో భక్తుల సందడి..

హరిహరులకు ఎంతో ఇష్ట‌మైన కార్తీకమాసం సందడిగా ప్రారంభమైంది. జిల్లాలో కొవిడ్ నిబంధనల సడలింపుతో ఈ ఏడాది అధికారులు పుణ్యస్నానాలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు మొద‌లు పెట్టారు.

గోదావరి స్నానఘట్టాల వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. రాజమండ్రి సహా తూర్పుగోదావరి జిల్లాలోని ప‌లు శైవ క్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాల నిమిత్తం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement