Thursday, May 9, 2024

అభ్య‌ర్థులే లేని టిడిపి..54స్థానాల్లో విజ‌యం ఖాయం..మంత్రి అనిల్ కుమార్..

టిడిపిపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టిడిపికి అభ్య‌ర్థులే దిక్కులేర‌ని ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తుల‌కు టిడిపి వెంప‌ర్లాడుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 40వ డివిజ‌న్ లో టిడిపికి అభ్య‌ర్థి దొరికే ప‌రిస్థితి లేద‌న్నారు. 54 స్థానాల్లో వైసిపి విజయభేరి మోగించింది అంటూ వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారని 40వ డివిజన్ లో ప్రపోజల్ చేయడానికి ఆ పార్టీకి ఒక వ్యక్తి కూడా లేని దుస్థితిలో ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులను నిలబెట్టుకోవడం చేతకాక తాము బెదిరించామని అవాస్తవాలను చెప్పడం సరికాదని అన్నారు. 41వ డివిజన్ లో కనీసం ఆ పార్టీ అభ్యర్థిని ప్రపోజల్ చేసేందుకు ఒక మనిషి రాలేదన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనైతిక పద్ధతులకు పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు. సిపిఎం పార్టీ తో చర్చలు విఫలమయ్యాయని… సీపిఐ కి ఒక సీటు కేటాయించారని.. మరోవైపు జనసేన తో చర్చలు జరపడం చేశారని అన్నారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండమని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 54 స్థానాల్లో వైసీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement