Sunday, April 28, 2024

పునీత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన రాజేంద్ర‌ప్ర‌సాద్..

సీనియ‌ర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ .. పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ పార్థీవదేహాన్ని చూడలేకపోయిన ఆయన.. తాజాగా పునీత్ ఇంటికి వెళ్లారు. బెంగుళూరులోని సదాశివనగర్‌లో పునీత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంట్లో పునీత్ చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులందరితో కాసేపు మాట్లాడి ఓదార్చారు. పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవ‌లే హ‌ఠాత్త్ మ‌ర‌ణం చెందారు క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. జిమ్ చేస్తుండ‌గా కుప్ప కూలిన ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement