Sunday, May 5, 2024

బావిలో పడి వ్యక్తి మృతి

వరదయ్యపాలెం, ప్రభ న్యూస్ : చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలోని కడూరు గ్రామంలో ఓ బావిలో పడి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. మృత్యుడు కలత్తూరు గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యంగా గుర్తించి, పోస్ట్ మార్టం నిమిత్తం సత్యవేడు ఏరియా ఆస్పత్రికి తరలించారు, ఈ మృతికి గల కారణాలపై విచారణ ప్రారంభించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలియజేశారు. మృతికి గల కారణమైన సమాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement