Thursday, May 2, 2024

పురుషుల సింగిల్స్‌లో సత్తా చాటిన లక్ష్యసేన్‌, శ్రీకాంత్‌

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌, శ్రీకాంత్‌ సత్తాచాటి ముందడుగు వేశారు. లక్ష్యసేన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో లక్ష్యసేన్‌ జపాన్‌ షట్లర్‌ కెంటా నిషిమోటాపై హోరాహోరీగా పోరాడి విజయం సాధించాడు. 15వ సీడ్‌ కెంటాపై లక్ష్యసేన్‌ 22-10, 15-21, 21-18తేడాతో విజయం సాధించి మూడోరౌండుకు చేరుకున్నాడు. అదేవిధంగా కిదాంబి శ్రీకాంత్‌ రెండో రౌండులోనూ సత్తా చాటాడు. తొలి రౌండులో స్థానిక షట్లర్‌ పాబ్లో అబియాన్‌పై వరుస సెట్లలో గెలిచిన శ్రీకాంత్‌ రెండో రౌండులో చైనీస్‌ తైపీకి చెందిన లీ ఫెంగ్‌పై 15-21, 21-18, 21-17 తేడాతో విజయం సాధించి ముందడుగు వేశాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement