Saturday, April 27, 2024

Big Breaking: నెల్లూరులో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌.. పోలీసు స్టేష‌న్‌నుంచి పారిపోయేందుకు బిగ్ స్కెచ్‌

ఏపీలోని శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లాలో దొంగ‌లు హ‌ల్ చ‌ల్ చేశారు. నెల్లూరు పోలీసు స్టేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు పెద్ద ప్లానే వేశారు. అయితే దొంగ‌లు త‌ప్పించుకుంటున్న విష‌యం ప‌సిగ‌ట్టిన పోలీసులు వారిని వెంబ‌డించి మ‌రీ ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (శుక్ర‌వారం) రాత్రి జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నెల్లూరు జిల్లాలోని క‌సుమూరు ద‌ర్గా ద‌గ్గ‌ర త‌మిళ‌నాడ‌కు చెందిన కొంత‌మంది దొంగ‌లు స్మార్ట్ ఫోన్ల‌ను దొంగ‌త‌నం చేశారు.

ఈ విష‌యాన్ని 100కి కాల్ చేసిన స్థానికులు పోలీసులు స‌మాచారం ఇచ్చారు. అయితే.. వెంక‌టాచ‌లం పోలీసులు ఫోన్లు చోరీ చేసిన వారిని ప‌ట్టుకుని నెల్లూరు పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో వారిని స్టేష‌న్‌లోని సెల్‌లో పెట్టి పోలీసులు త‌మ ప‌నుల్లో ఉండ‌గా.. కిటికీ ఉచ‌లు క‌ట్‌చేసి పారిపోయే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో అల‌ర్ట్ అయిన పోలీసులు వారిని త‌ప్పించుకోకుండా వెంబ‌డించి ప‌ట్టుక‌న్న‌ట్టు స‌మ‌చారం. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement