Wednesday, May 29, 2024

AP | పార్టీల జెండాలు వేరు.. ఎజెండా ఒక్క‌టే : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విజయం ఎన్డీయేదేనని.. కూటమికి మోదీ మద్దతు ఉందన్నారు. చిలకలూరిపేటలోని బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో బాబు మాట్లాడుతూ.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా ఎజెండా ఒక్కటేనని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా ఎజెండా అని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ ఇది.. మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. ఎన్నో పథకాలతో ప్రధాని మోదీ సంక్షేమాన్ని అందించారని పేర్కొన్నారు.

మేక్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నారని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement