Thursday, May 9, 2024

AP | పవన్ మాట్లాడుతుండగా మధ్యలో వచ్చిన ప్రధాని.. ఎందుకంటే !

చిలకూరి పేటలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రజాగళం సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.. సభకు జనం కిక్కిరిసిపోయారు. స‌భ‌పై ఉన్న నేతలను చూసేందుకు కొందరు వ్యక్తులు ఫోకస్ లైట్స్ టవర్ ఎక్కారు.

- Advertisement -

వారిని గమనించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే కూర్చున్న చోటు నుంచి లేచి పవన్ ప్రసంగం మధ్యలోకి వచ్చేశారు. ప్రధాని మోదీ మైక్ వద్దకు వచ్చి అందరూ కిందకు దిగాలని విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్ వీడి మరీ మైక్ వద్దకు వచ్చి చెప్పారు ప్రధాని మోదీ. పోలీసులు వెంటనే వారిని కిందకు దించాలని.. మీరు ఏం చేస్తున్నారంటూ ఖాకీలను ప్రశ్నించారు ప్రధాని. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. సభలో ఫోకస్ లైట్స్ టవర్స్ ఎక్కిన జనాలను కిందకు దించారు. ప్రధాని తీరుతో సభికులతో పాటు.. జనాలు సైతం ఆశ్చర్యపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement