Tuesday, April 30, 2024

ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వ్యక్తి కాదు..ఒక శక్తి అని ఆపార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్‌లో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ సాధించిన విజయాలు భవిష్యత్ లో ఎవరు సాధించలేరని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు రాజీపడకుండా పోరాడే వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. తెలుగు వారి గుండెల్లో నిలిచిన వ్యక్తి అని పేర్కొన్నారు.

రాజకీయాల్లో అనతి కాలంలోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. 2 రూపాయలకే కిలో బియ్యం, పేదవారు కోసం పక్క గృహాలను, గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలుగు జాతి వారసత్వ సంపద, రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శమన్నారు. దేవుడిని ఎన్టీఆర్‌లో చూసుకున్న రోజులున్నాయని, దేవుడి పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడన్నారు. బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆచరణ సాధ్యం‌ కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారని చంద్రబాబు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement