Sunday, May 19, 2024

12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు: గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

సీఎం జగన్ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను తెదేపా నేతలు కలిశారు. బ్లాంక్‌, రహస్య జీవోల వ్యవహారంపై గవర్నర్‌కు వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్ ఫిర్యాదు చేశారు. 12 రోజుల్లో 50 బ్లాంక్‌ జీవోలు ఇచ్చారని బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం పారదర్శక పాలన చేయడం లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు.

ఫిర్యాదు చేస్తే మాకేంటన్న రీతిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. జగన్‌ నేతృత్వంలో అర్ధరాత్రి బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. అన్నీ బ్లాంక్‌ జీవోలే.. తేదీ, జీవో నెంబర్‌ మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. బ్లాంక్‌ జీవోలు చూపిస్తే గవర్నర్‌ ఆశ్చర్యపోయారని అన్నారు.  పారదర్శకంగా పరిపాలన ఎందుకు చేకలేకపోతున్నారని ప్రశ్నించారు. అర్ధరాత్రి జీవోలు, బ్లాంక్‌ జీవోలు ఇకనైనా మానుకోవాలి వర్ల రామయ్య హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement