Saturday, May 18, 2024

రేవంత్‌రెడ్డికి తెలంగాణ సర్కారు షాక్

టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దళిత దండోరా పేరుతో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత దండోరా మహాసభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయితే భద్రతాపరమైన కారణాలతో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు.

దీంతో చేసేదేమీ లేక సభా ప్రాంగణాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. దీంతో పోలీసులు పలు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కావాలనే రేవంత్‌రెడ్డిపై కక్ష కట్టి సభలకు అనుమతి ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: ‘దళిత బందు’ నిధులిస్తే.. రాజీనామా చేస్తా: బీజేపీ ఎమ్మెల్యే

Advertisement

తాజా వార్తలు

Advertisement