Thursday, May 2, 2024

పెత్తందారుల వైపు పోరాటం చేస్తున్న టీడీపీ.. జోగి ర‌మేష్‌

తెలుగుదేశం పార్టీ పెత్తందారుల వైపు పోరాటం చేస్తుంద‌ని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. అమరావతిలోని మందడం, పెనుమాకలలో టిడ్కో ఇళ్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుది అంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.

నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటపడుతున్నారని.. పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు వెళ్లాడని.. అయినా పేదలు, ప్రభుత్వ విధానమే గెలిచిందన్నారు. 51 వేలకు పైగా మందికి రేపు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉంటే చంద్రబాబుకు అంటరానితనమా ? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement