Saturday, April 27, 2024

ఓయూలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం..

ఎంసెట్‌ ఫలితాల్లో ర్యాంకు రాలేదని ఓయూలో విద్యార్థి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టాడు. నల్లకుంటలో నివాసం ఉండే చైతన్య అనే స్టూడెంట్‌ డీడీ కాలనీలోని జూనియర్‌ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేశాడు. నేడు వెలువడిన ఫలితాల్లో విఫలం కావడంతో ఓయూలోని ఠాగూర్‌ ఆడియోరియం సమీపంలో పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు విద్యార్థి ఒంటిపై మంటలను ఆర్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement