Monday, April 29, 2024

Judgement – 30 మంది చిన్నారులపై లైంగిక దాడి – మాన‌వ‌మృగానికి జీవిత ఖైదు..

ఢిల్లీ: అభం శుభం తెలియని పసిపిల్లల్ని కిడ్నాప్‌ చేసి, లైంగికదాడి కి పాల్పడి ప్రాణాలు తీసిన మానవ మృగానికి గురువారం కోర్టు శిక్ష విధించింది. దోషి రవీంద్రకుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ దిల్లీలోని రోహిణి కోర్టు తీర్పునిచ్చింది. ఆరేళ్ల చిన్నారిని దారుణంగా హింసించి, హతమార్చిన కేసులో మే 9నే కోర్టు అతడిని దోషిగా తేల్చగా తాజాగా శిక్ష ఖరారు చేసింది. వివ‌రాల‌లోకి వెళితే రవీంద్రకుమార్‌ 18 ఏళ్ల వయసులో ఉండగా, 2008లో అతడి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి వలస వచ్చింది. అక్క‌డ రవీంద్ర డ్రగ్స్‌కు, అశ్లీల దృశ్యాలకు బానిసయ్యాడు. రోజంతా కూలీగా పనిచేసి, రాత్రిపూట డ్రగ్స్‌ తీసుకునేవాడు. అర్ధరాత్రి నిద్ర లేచి చిన్నపిల్లలను వెదుక్కొంటూ దగ్గర్లోని నిర్మాణ ప్రదేశాలు, మురికివాడలకు వెళ్లేవాడు. దొరికిన పిల్లలను నిర్జన ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగికంగా హింసించి హతమార్చేవాడు. ఇలా 2008 నుంచి 2015 మధ్య 30 మంది ఉసురు తీశాడు. మృతులంతా 6-12 ఏళ్ల వయసువారే. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వేర్వేరు ప్రదేశాలను ఈ నేరాల‌కు పాల్ప‌డ్డాడు.
అలా 2014లో ఆరేళ్ల పాపను చంపి, సెప్టిక్‌ ట్యాంకులో విసిరేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అతడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 2015లో దిల్లీలోని సుఖ్‌బీర్‌నగర్‌ ప్రాంతంలో రవీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. తాజాగా జీవిత ఖైదు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement