Monday, May 20, 2024

ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం త్రిబుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్ కు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పియూసి 2వ సంవత్సరం చదువుచున్న విద్యార్థిని హాస్టల్ రూమ్ ఎవ‌రు లేని స‌మ‌యంలో ఉరి వేసుకుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వగ్రామం విజయనగరం జిల్లా సాలూరు గ్రామంగా గుర్తించారు. బుధవారం ఉదయం జరిగిన పరీక్ష సరిగ్గా రాయని కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement