Thursday, May 16, 2024

ఏపీలో రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.26లక్షల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలను ఆమోదించింది. అలాగే గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించింది. అదేవిధంగా భవనపాడు పోర్టు విస్తరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. దివ్యాంగులకు 4శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement