Saturday, April 27, 2024

పురుషోత్తపురం చెక్ పోస్ట్ ను సందర్శించిన ఎస్పీ రాధిక

ఇచ్ఛాపురం : పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక సందర్శించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఇక్కడికి వచ్చిన ఆమె డి.ఎస్.పి శివ రామ రెడ్డి, సిఐ సతీష్ కుమార్, పట్టణ, రూరల్, ఎస్ ఐలు సత్యనారాయణ, బి.హైమావతితో కలిసి సందర్శించారు. అంతకుముందు పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయం సందర్శించి, రికార్డులు తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అక్రమ మద్యం, గంజాయి, నాటు సారాను అరికట్టేందుకు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేయాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement