Wednesday, May 1, 2024

ఆమ్నెస్టీ ఇండియా మాజీ చైర్మన్ కి చుక్కెదురు – ఎయిర్ పోర్ట్ లో నిలిపివేసిన అధికారులు

ఆమ్నెస్టీ ఇండియా మాజీ చైర్మన్ ఆకార్ పటేల్‌కు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలన్న సీబీఐ డైరెక్టర్ ఆదేశాలపై ఢిల్లీ కోర్టు శుక్రవారం స్టే విధించింది. పటేల్‌కు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని దిగువ కోర్టు గురువారం సీబీఐని ఆదేశించింది. దీనిపై సీబీఐ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో అప్పటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా బోర్డు ఛైర్మన్ ఆకార్ పటేల్‌పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి)ని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ కోర్టు గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ని కోరడం గమనార్హం. రు. ఇప్పుడు ఈ నిర్ణయంపై సీబీఐ పెద్ద కోర్టులో అప్పీలు చేసేందుకు యోచిస్తోంది. సిబిఐ సర్క్యులర్ కారణంగా, బెంగుళూరు విమానాశ్రయంలో ఆకార్ పటేల్ అమెరికాకు వెళ్లే విమానం ఎక్కకుండా ఆపివేశారు. ఆకార్ పటేల్ ..ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) కింద కేసు విచారణ జరుగుతోందని, కోర్టు ముందు ఛార్జ్ షీట్ కూడా సమర్పించామని సిబిఐ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement