Thursday, May 2, 2024

Srikakulam – సొంతింటి క‌ల నెర‌వేర్చిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్ దే… రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం, నవంబర్ 15: పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేర్చిన ఘ‌నత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కితాబిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాల‌యంలో సింగుపురం పంచాయ‌తీకి చెందిన 80 మందికి ఇంటి ప‌ట్టాలు అందించి, శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని తెలిపారు .

అలానే ప్ర‌భుత్వం పాల‌నా ప‌రంగా తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగాను, తీసుకు వ‌స్తున్న సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా ఇవాళ స‌త్ఫ‌లితాలు వ‌స్తున్నాయి అని అన్నారు. ముఖ్యంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు కార‌ణంగా జీవ‌న ప్ర‌మాణాల పెంపుద‌ల అన్న‌ది సాధ్యం అయింద‌ని చెప్పారు. దేశంలోనే అత్యున్న‌త రీతిలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా ఇంటి ప‌ట్టాల పంపిణీ చేప‌ట్టామ‌ని, ఇందుకోసం ప‌న్నెండు వేల కోట్ల రూపాయ‌లు వెచ్చించి ప్ర‌యివేటు భూమి కొని, దానిని సంబంధిత అర్హుల‌కు పంపిణీ చేశామ‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement