Sunday, April 28, 2024

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే రెండు సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనుంది. ట్రైన్‌ నెం 07581 సికింద్రాబాద్‌ కటక్‌(శనివారం) ఈ నెల 21వ తేదీన ఉదయం 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు చేరుకోనుంది. 07582 కటక్‌- సికింద్రాబాద్‌ (ఆదివారం) 22న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.20 గంటలకు చేరుకోనుంది. మార్గమధ్యంలో జనగాం, కాజిపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడె పల్లిగూడెం, నిడదవోలు, రాజమంత్రి, ద్వారపూడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, నవ్‌పడ, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర స్టేషన్లలో ఆగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement