Monday, May 6, 2024

23 నుంచి పదోతరగతి పరీక్షలు.. స్టూడెంట్స్ కి ఆర్టీసీ గుడ్ న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు శ‌నివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త తెలిపింది. ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో విద్యార్థులు ఉచితంగా ప్ర‌యాణించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తూ ప్ర‌క‌టించింది. విద్యార్థులు వారి ఎగ్జామ్ సెంట‌ర్ల వ‌ద్దకు వెల్ల‌డానికి మ‌ళ్లీ ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత తిరిగి ఇంటికి చేరుకోవ‌డానికి కూడా బ‌స్సులు అందుబాటులో ఉండ‌నున్నాయి. అయితే విద్యార్థులు ఫ్రీగా ప్ర‌యానించాలంటే త‌ప్ప‌నిస‌రిగా త‌మ హాల్ టికెట్ల‌ను కండ‌క్ట‌ర్ల‌కు చూపించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement