Monday, May 6, 2024

ఆరోగ్య రంగంలోకి అదానీ గ్రూప్…

సిమెంట్‌ పరిశ్రమలో సంచలనంగా మారిన బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ ఇప్పుడు ఆరోగ్య రంగంలో ప్రవేశించనున్నది. ఇందుకోసం అది ఓకంపెనీని ప్రారంభించింది. ఆసుపత్రులు, డయాగ్నిస్టిక్‌ చైన్‌ సంస్థలు, ఫార్మసీస్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఈ రంగంలో విస్తరించాలని అదానీ గ్రూప్‌ భావిస్తున్నది. మే 17న అదానీ హెల్త్‌ వెంచర్‌ లిమిటెడ్‌(ఏవీహెచ్‌ఎల్‌)ను స్థాపించింది.

ఈ కొత్త కంపెనీ… ఆరోగ్య రంగానికి చెందిన డయాగ్నిస్టిక్‌ కేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య సేవలు అందించే సంస్థలు, రీసెర్చ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. త్వరలోనే ఏవీహెచ్‌ ఎల్‌ తన కార్యకలాపాలు ప్రారంభిస్తుందని కూడా వివరించింది. ఈ రంగంలో దాదాపు 4 బిలి యన్ల డాలర్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో కీలకంగా ఉన్న ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వివరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement