Friday, April 19, 2024

కోడూరు బీచ్ లో ఇద్దరు విద్యార్థుల మృతి

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు బీచ్ కు వెళ్తే నీటిలో ముగిని మృతిచెందిన ఘ‌ట‌న నెల్లూరు జిల్లా పోస్టల్ కాలనీలో చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు కొత్త కోడూరు బీచ్ లో సరదాగా ఈతకు వెళ్లిన అన్నదమ్ములు ఇద్దరు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. మృతులు శశాంక్ (19), ప్రణీత్ (16) గా గుర్తించారు. వీరు నెల్లూరు పట్టణంలోని పోస్టల్ కాలనీకి చెందిన వారు. మృతిచెందిన యువకుల మృతదేహాలను నెల్లూరుకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పోస్టల్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement