Tuesday, April 30, 2024

Krishna Express: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు, త‌ప్పిన ప్ర‌మాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఇవాళ‌ ఉదయం పొగలు వచ్చాయి. ఏసీ బోగీ చక్రాల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు.. తిరుపతి జిల్లా వెంకటగిరి-ఎల్లకారు మధ్య చైన్‌ లాగి రైలును నిలిపివేశారు.

రైల్వే కోపైలట్‌, సిబ్బంది ఏసీ బోగీ వద్దకు వచ్చి పరిశీలించారు. బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాలపాటు రైలు నిలిచిపోయింది. అనంతరం మరమ్మతులు చేపట్టడంతో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ యథావిధిగా బయల్దేరింది. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement