Sunday, April 28, 2024

AP: విజ‌య‌వాడ‌లో బొత్స క్యాంప్ కార్యాల‌యం ముట్ట‌డి… ఉద్రిక్త‌త…

విజ‌య‌వాడ – ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి కొత్తకొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కారు.

విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ కార్యకర్తలు యత్నించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement