Saturday, April 27, 2024

అమ‌రావ‌తిలో శ్రీ‌వారి నూత‌న‌ ఆల‌యం.. ప్రారంభోత్స‌వానికి రావాల‌ని సీఎం జగన్‌కు ఆహ్వానం..

అమరావతి, ఆంధ్రప్రభ: అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. బుధవారంసీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సుబ్బారెడ్డి కలిశారు.

ఈ నెల 4నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. టీటీడీ వేద పండితులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement