Saturday, April 27, 2024

Security – 30న క‌ర్నూలులో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న – భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన డిఐజి

కర్నూలు జిల్లా… రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలనీ కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ అన్నారు. ఈ నెల 30 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలోని పత్తికొండలో పర్యటిస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనలో భద్రత పరంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్, కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.


పత్తికొండ సెయింట్ జోసెఫ్ స్కూల్ లో రైతు భరోసా కార్యక్రమం జరగనున్న సంధర్భంగా హెలిప్యాడ్ , పోలీసు బందోబస్తు, వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్లకు సంబంధించి సమన్వయంతో పని చేయాలని , ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్ బందోబస్తులను పరిశీలించారు. పోలీసు అధికారులకు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement