Thursday, April 25, 2024

Drowned – పాతాళ గంగలో ఒకరు గల్లంతు ..

నంద్యాల : శ్రీశైలం పాతాళగంగలో ఈత కొడుతు నీటిలో వ్యక్తి గల్లంతైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా గురిజెపల్లికి చెందిన వెంకటేశ్వర్లుగా (45) గుర్తించిన పోలీసులు. ాయన గురువారం గల్లంతయినట్టు గుర్తించారు. శ్రీశైలం పాతాళగంగ ఆంధ్రా తెలంగాణ బార్డర్ మద్యలోని నీటిలో ఘటన జరిగింది..దీంతో శ్రీశైలం టూటౌన్ పోలీసులు, తెలంగాణ రాష్ట్రం దోమలపెంట పోలీసులు సంఘటన స్దలానికి చేరుకున్నారు.. చివరకు దోమలపెంట పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement