Sunday, May 19, 2024

రాజ్యసభ స్థానాలకు రెండో సెట్టు నామినేషన్‌ పత్రాలు దాఖలు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి అధికార వైసీపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రెండో సెట్టు నామినేషన్‌ పత్రాలను మంగళవారం దాఖలు చేశారు. విజయసాయి రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు రెండో రెండో సెట్టు- నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాల దాఖలుకు చివరి రోజైన మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్‌ అధికారి పి.వి. సుబ్బారెడ్డికి వీరు రెండో సెట్టు నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

రాజ్యసభ సభ్యుల ఎన్నికలో పోటీ-చేసే వైసీపీకి చెందిన అభ్యర్థులలో ఆర్‌.కృష్ణయ్య రెండో సెట్టు- నామినేషన్‌ పత్రాలను నేరుగా రిటర్నింగ్‌ అధికారికి అందజేసారు. ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, బీద మస్తాన్‌ రావు తరుపున రాష్ట్ర మంత్రులు జోగి రమేష్‌, అంబటి రాంబాబు రెండో సెట్టు- నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement