Tuesday, May 21, 2024

అమెరికాలో పారాసెయిలింగ్ చేస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన మహిళ మృతి..

అమెరికాలో జరిగిన పారాసెయిలింగ్ ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ మహిళ చ‌నిపోయారు. ఆమె పేరు సుప్రజ. వయసు 34 సంవత్సరాలు. సుప్రజ, ఆలపర్తి శ్రీనివాసరావు భార్యాభర్తలు. బాపట్ల జిల్లాలోని చింతపల్లిపాడు (మార్టూరు మండలం) వీరి స్వస్థలం. 2012లో అమెరికా వెళ్లిన శ్రీనివాసరావు చికాగోలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం కిందట వీరి కుటుంబం ఫ్లోరిడాకు మారింది. కాగా, ఇతర కుటుంబాలతో కలిసి సుప్రజ, శ్రీనివాసరావు కుటుంబం విహారయాత్రకు వెళ్లగా, అది విషాదాంతంగా మారింది.

శ్రీ‌నివాస‌రావు, సుప్ర‌జ‌ల పిల్లలు అక్షత్ చౌదరి (10), శ్రీ అధిరా (6)ల‌ను కూడా విహారయాత్రకు తీసుకెళ్లారు. అయితే, కుమారుడు అక్షత్ తో కలిసి సుప్రజ బోట్ పారాసెయిలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారింది. బలమైన గాలులు వీయడంతో ఆ పారాచ్యూట్ ను బోటుకు అనుసంధానించిన తాళ్లు తెగిపోయాయి. దాంతో, ఆ పారాచ్యూట్ ఓ వంతెనకు బలంగా తగలడంతో ప్రమాదం సంభవించింది. తీవ్రగాయాలపాలైన సుప్రజ ప్రాణాలు విడవగా, కుమారుడు అక్షత్ కు తేలికపాటి గాయాలయ్యాయి. సుప్రజ మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement