Sunday, April 28, 2024

AP: లారీని ఢీకొట్టిన స్కూటీ… ఒక‌రు మృతి

ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొట్ట‌డంతో ఒక‌రు మృతిచెందిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు నుంచి విజ‌య‌వాడ‌కు స్కూటీపై భార్య‌భ‌ర్త‌లు వెళ్తుండ‌గా కాజా టోల్ గేట్ వద్ద యాక్సిడెంట్ జ‌రిగింది.

ఆగి ఉన్న లారీని ఒక్కసారిగా ఢీ కొట్టడంతో స్కూటర్ పై ఉన్న భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలు కావ‌డంతో ఆసుపత్రికి తరలించారు. మంగ‌ళ‌గిరి రూర‌ల్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement