Saturday, May 4, 2024

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు – త‌ప్పిన ముప్పు

యాదమరి ప్రభ న్యూస్ : మాది రడ్డిపల్లి నుండి యాదమరి మీదుగా చిత్తూరుకు వెళ్ళవలసిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పడంతో పొలాల్లోకి ద‌సుకు వెళ్ళింది. మాది రెడ్డిపల్లి నుంచి బయలుదేరిన బస్సు పి. గొల్లపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలంలోకి దిగబడింది. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇతర వాహనాల్లో తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement