Friday, April 26, 2024

అన‌కాప‌ల్లి జిల్లాలో రూ.3కోట్ల న‌గ‌దు ప‌ట్టివేత

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో భారీగా న‌గ‌దు ప‌ట్టుబ‌డింది. జిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో సుమారు రూ.3కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి పోలీసులు సమాచారం అందించి, సీజర్‌ పంచనామా నిర్వహించారు. విశాఖ వైపు నుంచి అమలాపురం ప్రాంతానికి వెళ్తున్న ఓ వ్యక్తి కారులో డబ్బు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు. కారులో రూ.3కోట్ల నగదు ఉందని ఎస్పీ గౌతమి శాలీ ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement