Friday, April 26, 2024

Breaking: ఏపీ సర్కార్ కు సుప్రీంకోర్టులో ఊరట

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు తీర్పులో కొన్ని అంశాలపై ప్రభుత్వానికి తక్షణ ఉపశమనం కలిగించినట్లైంది. కాల పరిమితిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 2023 జనవరి 31కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement