Wednesday, May 8, 2024

AP: భారత్​జోడోలో రాహుల్​ జోష్​.. బాలికను బుజాలపై మోస్తూ పాదయాత్ర (వీడియో)

భారత్​ జోడో యాత్రలో కాంగ్రెస్​ ముఖ్యనేత రాహుల్​ గాంధీ జనాలకు మరింత చేరువ అవుతున్నారు. తనతో పాటు కలిసినడిచే వారితో చిట్​చాట్​ చేసి పసందైన కబుర్లు చెబుతూ వారిలో ఉత్సాహాన్ని తెస్తున్నారు. ఇక జవహర్​ లాల్​ నెహ్రూ అంటే చిన్న పిల్లలకు ఎంత ఇష్టమో అన్నట్టు ఆ వారసత్వం తనలోనూ ఉందని నిరూపించుకుంటున్నారు.

భారత్​ జోడో యాత్ర మొదలైనప్పటి రాహుల్​తో చిన్నారులు కలిసి నడుస్తున్న మరుపురాని ఎన్నో ఘటనలున్నాయి. ఇక.. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగుతుండగా.. ఇవ్వాల (శుక్రవారం) రాహుల్​ గాంధీ బుజాలమీద ఓ బాలికను మోసి ఔరా అనిపించారు. ఇది చూసి పాదయాత్రలో ఉన్నవారంతో బిగ్గరగా షౌటింగ్​ చేయడం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement