Sunday, May 12, 2024

రిలయన్స్‌ జియో నికర లాభం 4,518 కోట్లు.. రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడి

రిలయన్స్‌ జియో రెండో త్రైమాసికంలో నికర లాభంలో 28 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో జియో 4,518 కోట్లు నికర లాభం ఆర్జించింది. గత సంవత్సరం ఇదే సమయంలో జియో 3,528 కోట్ల రూపాయల నికర లాభం సాధించింది. గత త్రైమాసికంలో 18,735 కోట్లతో పోల్చితే ఈ త్రైమాసికంలో 20.2 శాతం పెరుగుదలతో 22,521 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలోనే రిలయన్స్‌ జియో దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. 5జీ సర్వీస్‌లను ఎంపిక చేసిన నగరాల్లోనూ ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement