Tuesday, July 23, 2024

TS: బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిని పరామర్శించనున్న కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆదివారం నాడు రత్యానాయక్ తండాలో రమావత్ కనీలాల్ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేసీఆర్ రత్యానాయక్ తండాకు వెళ్లి దివంగత కనీలాల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అటు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనిలాల్ నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి.. రమావత్ రవీంద్ర కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement