Wednesday, May 15, 2024

Proddutur – యువకులపై కత్తులతో దాడి – ఇద్దరు పరిస్థితి విషమం

కడప, ప్రభ న్యూస్ – ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం మోరీల వద్ద వేంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.వేంపల్లి కు చెందిన పవన్ కళ్యాణ్ , వెంకటేష్ , నాగేంద్రలు దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రొద్దుటూరు పట్టణంలోని వారి బంధువుల ఇంటికి సోమవారం రాత్రి వచ్చారు. ఆటోలో వెళ్తున్న వీరి ఆటోకు ద్విచక్ర వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది వివాదంగా మారడంతో అప్పటికే కత్తులతో వచ్చిన దుండగులు వేంపల్లి యువకులపై దాడి చేశారు.

కత్తులతో పొడిచి పారిపోయారు.తీవ్ర రక్త గాయాలతో ఉన్న బాధితులను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. కత్తులతో పొడిచి పారిపోతున్న వారిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ద్విచక్ర వాహనాన్ని వదిలి పారిపోయారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement