Friday, May 17, 2024

Accident – పండగ పూట విషాదం – రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలికలు దుర్మరణం

జన్నారం, అక్టోబర్ 24 ( ప్రభ న్యూస్): దసరా పండగ పూట విషాదం నెలకొంది. గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు బాలికలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ చెక్కపల్లి గుంట వద్ద సోమవారం రాత్రి పొనకల్ వాసి పుప్పర్ల గంగన్న కూతురు పుప్పర్ల రాహిత్య (15), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సాగర్, జోష్న దంపతుల కూతురు సాత్విక(19)ను గంగన్న మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వాహనం రాత్రి ఢీకొనగా, ఇద్దరు బాలికలు వాహనంపై నుంచి ఎగిరి పడి తీవ్రగాయాల గురయ్యారు.

తీవ్రగాయాల గురైన ఇద్దరు బాలికలను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు బాలికలు మృతి చెందారు. వాహనం నడిపిన గంగన్న స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన ఇద్దరి బాలికలది పొనకల్ కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాల వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక ఎస్సై పి.సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement