Tuesday, April 30, 2024

ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్..

యర్రగొండపాలెం : కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని వైద్యాధికారి డా. సురేష్‌ తెలిపారు. స్థానిక సచివాలయంలో 45 సం.లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ను వేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని, దీని వలన ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లు ఉండవని అపోహలను వీడాలని తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వలన కరోనా మహమ్మారిని అదుపులో ఉంచవచ్చని తెలిపారు. ఇప్పటికీ వ్యాక్సిన్‌ వేయించుకోని వారు తప్పక వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. అనంతరం సుమారు 45 మందికి రూరల్‌ వ్యాక్సిన్‌ అందజేశారు. తగిన పరీక్షలు నిర్వహించే వ్యాక్సిన్‌ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement