Friday, May 3, 2024

రెడ్డి కార్పొరేషన్ ‌ ఏర్పాటుకు కృషి ..

మార్కాపురంటౌన్‌: రెడ్డి కార్పోరేషన్‌ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఏపి రెడ్డి జాతృతి అధ్యక్షురాలు హిమబిందురెడ్డి తెలిపారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్టు బి.వి సుబ్బారెడ్డి కుమార్తెగా మీ అందరికి సుపరిచితమేనని, రెడ్డి జాగృతి ఏపి అధ్యక్షురాలిగా నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. పేరుకే అగ్రవర్ణం అని అందులో కూడా పేదలున్నారన్నారు. రెడ్లలో పేదల సంక్షేమం కోసం, విద్య, వైద్యం కోసం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం రెడ్డి కార్పోరేషన్‌ ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఆర్థికంగా వెనుకబడిన రెడ్ల వెనుకబాటు, రెడ్ల సంక్షస్త్మం కోసం తన వంతు సహాయం చేస్తానని, రెడ్డి కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement